ధనుష్, నాగార్జున లతో పాటు రానా ని కూడా లైన్ లో పెట్టిన శేఖర్ కమ్ముల...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల( Shekhar Kammula ).

ఈయన చేసిన చాలా సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి.

అలాగే యూత్ ని ఎక్కువ ఆకట్టుకోవడంలో ఈయన ఎక్కువ సక్సెస్ అయ్యాడు.ఇక అదే విధంగా ప్రస్తుతం ఈయన నాగార్జునతో ఒక సినిమాని తీస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత ఆయన 15 సంవత్సరాల క్రితం రానా ( rana )మొదటి సినిమాగా వచ్చిన లీడర్ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.అంటే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.

అనే పాయింట్ ని బేస్ చేసుకుని ఈ సినిమా స్టోరీ ని రాసుకున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

మరి ఈ సినిమాలో రానా ఉంటాడా లేదా వేరే హీరో నటిస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇక ఇదే క్రమంలో శేఖర్ కమ్ముల ఆల్రెడీ ఒక సినిమాని చేస్తూనే మరొక సినిమాని అనౌన్స్ చేయడం ఇదే మొదటిసారి.నిజానికి ఆయన ఒక సినిమా తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మరొక సినిమా చేస్తాడు.

కానీ ఇప్పుడు ఏకంగా ఒక సినిమా చేస్తూనే మరొక సినిమాను అనౌన్స్ చేశాడు అంటే శేఖర్ కమ్ముల చాలా పకడ్బందీ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఈ సినిమాలతో ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఆయన గత చిత్రమైన లవ్ స్టోరీ సినిమా( Love story movie ) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.అందుకే ఇప్పుడు ఎక్కువ గ్యాప్ తీసుకొని సినిమా చేయడానికి రెఢీ అయినట్టు గా తెలుస్తుంది.మారి శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలతో ఎలాగైనా ఆయన సక్సెస్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు