అల్లు వారి అబ్బాయి ప్రారంభించాడు

‘గౌరవం’ సినిమాతో అల్లు శిరీష్‌ పరిచయం అయ్యి చాలా కాలం అయ్యింది.ఆ తర్వాత ఈయన ‘కొత్త జంట’ సినిమాతో వచ్చాడు.

అది వచ్చి కూడా చాలా కాలం అయ్యింది.ఈయన మూడవ సినిమాకు చాలా సమయం తీసుకున్నాడు.

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నేడు కెమెరా ముందుకు వచ్చాడు.గత రెండు సినిమాలు చేదు అనుభవాన్ని మిగల్చడంతో తప్పకుండా సక్సెస్‌ సాధించాలనే పట్టుదలతో అల్లు శిరీష్‌ ఇంత కాలం కెమెరాకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో తన నటనతో పాటు బాడీని కూడా ఇంప్రూవ్‌ చేసుకున్నాడు.అదే సమయంలో పలు కథలు కూడా విన్నాడు.

Advertisement

నేడు ఈయన హీరోగా ‘సోలో’ ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయ్యింది.ఈ సినిమాను అల్లు అరవింద్‌ నిర్మించనున్నాడు.

ఈ సినిమాకు ‘మేరి జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.వైవిధ్యభరిత చిత్రాలను అందించడంలో పరుశురామ్‌కు ఒక ప్రత్యేక శైలి ఉంది.

అల్లు శిరీష్‌ను కొత్తగా చూపించేందుకు పరుశురామ్‌ కృషి చేస్తాను అంటున్నాడు.ఇక ఈ సినిమాలో అల్లువారి అబ్బాయి కండలు పెంచి, సిక్స్‌ ప్యాక్‌ను చూపించబోతున్నాడు.

మరి ఈ మూడవ సినిమా అయినా అల్లు శిరీష్‌కు సక్సెస్‌ను తెచ్చి పెట్టేనా చూడాలి.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు