అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఈయన తన సినిమాలతో, తన స్టైల్ తో రోజురోజుకూ అభిమానులను పెంచుకుంటున్నాడు.
అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సమయం కేటాయించి మరి కుటుంబంతో ఆనందంగా గడుపుతాడు.ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచి పోవడంతో ఇప్పుడు స్టైలిష్ స్టార్ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నాడు.
అల్లు అర్జున్ కుటుంబంతో ఎంత సరదాగా గడుపుతాడో ఆయన ఫ్యాన్స్ కు బాగా తెలుసు.సినిమా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినా కుటుంబంతో గడపడానికే అల్లు అర్జున్ ఇష్టపడుతుంటాడు.
ఫ్యామిలీతో అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళ్తుంటాడు.అంతేకాదు ఫ్యామిలీ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాడు.
అల్లు అర్జున్ కు తన కూతురంటే ఎంతో ఇష్టం.తన కూతురుతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు.
తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఒక ఫోటోను షేర్ చేసింది.ఆ ఫొటోలో అల్లు అర్జున్ గుండెలపై అల్లు అర్హ నిలబడి ఫోటోలకు ఫోజులిస్తుంది.ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్, అర్హ ఫోటోను స్నేహ తీసింది.ఆ బ్యూటిఫుల్ ఫోటోను స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ పిక్ వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా కనిపించబోతుంది.ఈ మధ్యనే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాను ఆగస్టు 13 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.