యాదాద్రి భువనగిరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం మిషన్ల కేటాయింపు పూర్తి అయిదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ హనుమంతు కె.జెండగే తెలిపారు.జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు రెండవ విడుత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలకు ఈవిఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు.25 శాతం అదనంగా బాలెట్ యూనిట్లు,కంట్రోల్ యూనిట్లు,40 శాతం అదనంగా వివిప్యాట్లు కేటాయించామని,
మొత్తం 2141 పోలింగ్ కేంద్రాలకు గాను 8023 బ్యాలెట్ యూనిట్లు,2673 కంట్రోల్ యూనిట్లు,2994 వివిప్యాట్లు కేటాయించడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్, భువనగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి,ఆర్డీఓ అమరేందర్,మునుగోడు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి.సుబ్రహ్మణ్యం, నకిరేకల్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పూర్ణచందర్,తుంగతుర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి.ఎస్.లత, జనగాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి.కొమరయ్య, ఇబ్రహింపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె.అనంతరెడ్డి,కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి,డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఇడిఎం సాయికుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.