పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్రం మరికాసేపటిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్ లో జరిగే ఈ అఖిలపక్ష సమావేశాలనికి అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది.బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సభలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలను కేంద్రం కోరనుందని సమాచారం.2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.