టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న దర్శకుడు తేజ, ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని మ్యాచో స్టార్ గోపీచంద్తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్న తేజ, వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘అలిమేలుమంగ వెంకటరమణ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను తేజ ఫిక్స్ చేశాడు.దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
అయితే ఈ సినిమా షూటింగ్ను ఫిబ్రవరి 7 నుండి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈమేరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ షూటింగ్ను గోపీచంద్ మీద తెరకెక్కించాలని తేజ భావిస్తున్నాడు.ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఈ షూటింగ్ను ప్రారంభించాలని తేజ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ కథలో చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ఆయన ఇప్పటివరకు చేయని విధంగా ఉంటుందని, చాలా వైవిధ్యంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
మొత్తానికి లేడీ ఓరియెంటెడ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్కు కొదువే లేదనే విషయాన్ని షూటింగ్ ప్రారంభంతోనే చెప్పాలని చూస్తున్నాడు తేజ.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ను ఖచ్చితంగా కట్టిపడేస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథనంతో ఈ సినిమా రాబోతుందని తేజ అండ్ టీమ్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.అటు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి పేర్లు వినిపించినా, ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.