ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదం పొంచి ఉందని, మానవాళికి ముప్పు ఏర్పడనుందని ఇటీవల పలు ప్రముఖ కంపెనీల అధినేతలు, సీఈవోలు చెబుతూ వస్తోన్నారు.రానున్న కాలంలో ఏఐ వల్ల ఎన్నో ఇబ్బందులు రానున్నాయని, మానవుల నాశనానికి దారితీయవచ్చని చాలామంది హెచ్చరిస్తున్నారు.
ఏఐ వల్ల భవిష్యత్తులో మానవుల ప్రాణాలకు ముప్పు కూడా ఉండొచ్చని ఇప్పుడే హెచ్చరికలు జారీ చేస్తోన్నారు.అయితే వారి హెచ్చరికలు నిజమనేలా తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన చూస్తే అర్ధమవుతుంది.
అమెరికాలో( America ) తీవ్ర విషాదం జరిగింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తున్న ఒక డ్రోన్( Drone ) ప్రాణం తీసింది.అవును.మీరు విన్నది అక్షరాలా నిజం.
యూఎస్ వైమానిక దళానికి( US Air Force ) చెందిన డ్రోన్ బీభత్సం సృష్టించింది.తనను నడిపిస్తున్న ఆపరేటర్ను డ్రోన్ చంపేసింది.
డ్రోన్ను నిలువరించేందుకు ఆపరేటర్ ప్రయత్నిస్తుండగా ప్రాణం తీసేసింది.ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ఏఐతో నడిచే డ్రోన్లను ఇటీవల యూఎస్ వైమానిక దళం పరీక్షించింది.ఈ సందర్భంగా తమ శత్రువైన వైమానిక రక్షణను నాశనం చేయడానికి లక్ష్యంగా పెట్టుకోగా.ఈ పరీక్షల్లో ఏఐ టార్గెట్ను గుర్తించింది.ఎవరు అడ్డొచ్చినా ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టగా.తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన ఆపరేటర్ను కూడా చంపేసింది.శత్రువుని చంపవద్దని ఆపరేటర్ చెప్పినా వినకుండా డ్రోన్ చంపేసింది.

అంతేకాదు తనను నియంత్రించాలని చూసిన ఆపరేటన్ను కూడా హత్య చేసింది.డ్రోన్ను సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా కుదరలేదని అధికారులు చెబుతున్నారు.దీనికి సంబంధించిన వివరాలను యూఎస్ ఎయిర్ఫోర్స్ కల్నర్ సోషల్ మీడియాలో వెల్లడించారు.డ్రోన్ ఆపరేటర్తో చంపడమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు.దీంతో యూఎస్ వైమానిక దళం సభ్యుల భయపడుతున్ారు.