సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ నన్ను భరించలేదు అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
అయితే తాను వేరే ఉద్దేశంతో అన్నానని వివరణ ఇచ్చినప్పటికీ ఈయన పై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేక్షకులు మహేష్ బాబును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ విషయంలో మహేష్ బాబుకు మద్దతుగా కాంట్రవర్సి బ్యూటీ కంగనా నిలబడ్డారు.మహేష్ బాబు అన్న మాటలలో ఏ మాత్రం తప్పు లేదని నిజంగానే అతనిని బాలీవుడ్ భరించలేదని ఆమె మహేష్ బాబుకి మద్దతు తెలిపారు.
తాజాగా మరొక బ్యూటీ అమీషా పటేల్ మహేష్ బాబుకు మద్దతు తెలిపారు.మహేష్ బాబు ఎంతో మంచి వ్యక్తి.
ఆయన ఇతరుల పట్ల ఎంతో గౌరవంగా ఉంటారంటూ అమీషా పటేల్ మహేష్ బాబు పై ప్రశంసలు కురిపించారు.
ఈ విధంగా ఇతరుల పట్ల ఎంతో గౌరవంగా ఉండే మహేష్ బాబు బాలీవుడ్ గురించి ఇలాంటి విమర్శలు చేశారంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది.ఆయన ఎలాంటి దురుద్దేశంతోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని అతను ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అమీషా పటేల్ మహేష్ బాబుకు మద్దతు తెలిపారు.ఈమె మహేష్ బాబు సరసన నాని సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.