చంపేస్తామని 500 కాల్స్ వచ్చాయి.. సిద్దార్థ్ సంచలన ట్వీట్లు..?

బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో హీరో సిద్దార్థ్ ప్రేక్షకుల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సిద్దార్థ్ మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ మళ్లీ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతాడని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా సిద్దార్థ్ సంచలన ట్వీట్లు చేశారు.

తనను చంపేస్తామంటూ 500 బెదిరింపు కాల్స్ వచ్చాయని సిద్దార్థ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.తమిళనాడు బీజేపీ నేతలు, కార్యకర్తలపై సిద్దార్థ్ సంచలన ఆరోపణలు చేశారు.

తన కుటుంబ సభ్యులను రేప్ చేస్తామంటూ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని తనకు వచ్చిన కాల్స్ గురించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని సిద్దార్థ్ అన్నారు.తన ఫోన్ నంబర్ ను బీజేపీ ఐటీ సెల్ విభాగం లీక్ చేసిందని సిద్దార్థ్ అభిప్రాయపడ్డారు.

కేవలం 24 గంటలలో తనతో పాటు తన కుటుంబ సభ్యులకు సైతం బెదిరింపు కాల్స్ వచ్చాయని సిద్దార్థ్ పేర్కొన్నారు.తనకు వచ్చిన కాల్స్ అన్నీ తాను రికార్డ్ చేశానని సిద్దార్థ్ పేర్కొన్నారు.కాల్ రికార్డులను కూడా తాను పోలీసులకు అందజేశానని సిద్దార్థ్ వెల్లడించారు.

తనకు బెదిరింపు కాల్స్ వచ్చినంత మాత్రాన తాను టెన్షన్ పడటం లేదని సిద్దార్థ్ వెల్లడించారు.తనకు ఎదురైన సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటానని సిద్దార్థ్ అన్నారు.

సిద్దార్థ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సిద్దార్థ్ చేసిన పోస్టులపై డీఎంకే నేత సెంథిల్ స్పందిస్తూ సిద్దార్థ్ కు తమ పార్టీ అండగా ఉంటుందని కొంత సమయం ఇస్తే సిద్దార్థ్ కు ఎదురైన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు