ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలకు క్యాన్సర్, షుగర్, బిపి లాంటివి గతంలో చాలా తక్కువగా వచ్చేవి.కానీ ప్రస్తుతం ఏ ఇంటిలో చూసినా ఈ వ్యాధులు సాధారణంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో కొత్త కొత్త పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.డి విటమిన్ అనేది సహజసిద్ధంగా దొరికేది.
దీని వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.
విటమిన్ డి తో ఇప్పుడు చక్కర వ్యాధిని దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డి విటమిన్ ఎక్కువగా తీసుకున్న వారు మధుమేహం నుంచి బయటపడవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.టైప్2 డయాబెటిస్ బారిన పడేవారి ముప్పును ఇది తగ్గిస్తుందని చెబుతున్నారు.సూర్యుడిలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాగినప్పుడు డి విటమిన్ ఉత్పత్తి అవుతుంది.
ఇంకా కొన్ని రకాల ఆహారాలు, కూరగాయల్లో ఇది ఉంటుంది.ఇది కొవ్వులో కరిగిపోతుంది.ఇన్సులిన్ ఉత్పత్తి కి జీవక్రియలో డి విటమిన్ పాత్ర అధికంగా ఉంటుంది.
ఒక మెడికల్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు మూడు ప్రయోగాలను చేశారు.మధుమేహం సప్లిమెంట్ల ప్రభావన్ని పరిశీలించారు.
మూడు సంవత్సరాల తర్వాత వారిని పరిశీలిస్తే అక్కడ 15% వరకు చక్కర వ్యాధి తగ్గిందని తెలుసుకున్నారు.అంటే ఎలాంటి మందులు వాడకుండా ఏ డాక్టర్ అవసరం లేకుండానే చక్కర వ్యాధినీ తగ్గించుకోవచ్చు.
ఖర్చు లేకుండా మధుమేహం అలా కూడా దూరం చేసుకోవచ్చు.
ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో డి విటమిన్ లోపంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు.అంతేకాకుండా చక్కెర వ్యాధి, బిపి లాంటివి కూడా ఎక్కువమందికి వస్తున్నాయి.ముఖ్యంగా చక్కర వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది.
ఇలాంటి సమయంలో శాస్త్రవేత్తలు మంచి విషయాన్ని వెల్లడించారు.మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కేవలం డి విటమిన్ శరీరానికి సరిగా అందజేస్తే చాలు అని చెబుతున్నారు.
విటమిన్ డి శరీరానికి తాకేలా చూసుకుంటే చక్కర వ్యాధి దూరమైపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.