నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.వటువర్లపల్లి గ్రామ సమీపంలో పులి సంచరిస్తుందని తెలుస్తోంది.
రాత్రి సమయాలలో పశువుల మందపై పులి దాడులకు పాల్పడుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.అదే క్రమంలో ఉదయం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావి దగ్గర మేత మేస్తున్న ఎద్దులపై దాడికి ప్రయత్నించింది.
సమీపంలో ఉన్న రైతులు చూసి పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది.పెద్ద పులి సంచారంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.