టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది.లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకు 43 మంది నిందుతులను అరెస్ట్ చేశారు.
తాజాగా ఈ లీక్ కేసులో వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లోనే ఏఈ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్లు సమాచారం.
ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిశోర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.