హైదరాబాద్ లో ప్రముఖ ఛానల్ కు చెందిన ఓ వ్యక్తిపై పలు ఆరోపణలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆయన అక్రమాలకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( Hindustan Petroleum Corporation Limited ) (హెచ్ పీసీఎల్) అడ్డుకట్ట వేసింది.
మాదాపూర్ లో ల్యాండ్ నకిలీ ధృవపత్రాలతో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నట్లు హెచ్పీసీఎల్ గుర్తించిందని తెలుస్తోంది.ల్యాండ్ యజమానికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ ను నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు.
ఈ నేపథ్యంంలో ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయాలని గతంలోనే అధికారులు చెప్పినప్పటికీ బేఖాతరు చేశారని తెలుస్తోంది.దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆక్రమిత పెట్రోల్ బంక్( Petrol Bunk ) స్థలాన్ని సీజ్ చేశారు.
అయితే ఈ వ్యవహారాన్ని రూపాయి పెట్టుబడి లేకుండా ఛానల్ లో పేరు గడించిన ఓ వ్యక్తి ఆధ్వర్యంలో జరిగిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.