ఇటీవల కాలంలో దారుణ హత్యలు చేయాలంటే ఎంతో కష్టపడి మాస్టర్ ప్లాన్లు రచించాల్సిన అవసరం లేదు.నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణంగా హత్యకు పాల్పడాల్సిన అవసరం లేదు.
కేవలం హత్య చేయాల్సిన వ్యక్తి ఒంటరిగా కనిపిస్తే చాలు.ఇలాంటి కోవకు చెందిన ఓ దారుణమైన హత్య బెంగళూరు నగరంలో( Bangalore ) నడిరోడ్డుపై జరగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బెంగుళూరు లోని చౌడేశ్వరి నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త( Congress Party Activist ) దారుణ హత్యకు గురైన విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
హత్యకు గురైన వ్యక్తి పేరు రవి అలియాస్ మత్తి రవి గా( Matthi Ravi ) గుర్తించారు.ఇతని వయసు 42 సంవత్సరాలు.
గతంలో ఎన్ఎస్ యూఐ లో పనిచేశాడు.ప్రస్తుతం స్థానికంగా టెంపో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ కుసుమ తరఫున ప్రచారంలో పాల్గొన్న క్రియాశీలక కార్యకర్త.
బుధవారం రాత్రి స్థానిక కాంగ్రెస్ నాయకుడు అయిన కృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, తర్వాత ఇంటికి వస్తూ ఉండగా మార్గమధ్యంలో చౌడేశ్వరి నగర్ లోని హళ్లి రుచి హోటల్ ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి వెళ్లిపోయారు.స్థానికులు రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని చూసి నందిని లేఅవుట్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాళ్లతో దాడి చేయడం వల్ల రవి మరణించినట్లు నిర్ధారించారు.
బుధవారం రాత్రి హత్య జరిగిన సమీపంలో ఉండే సీఎం హెచ్ బార్ అండ్ రెస్టారెంట్లో గొడవ జరిగిందని, బహుశా ఆ గొడవే హత్యకు దారి తీసి ఉండవచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు.బార్ వైపు నుంచి రవిని తరుముకుంటూ ఐదు మంది వ్యక్తులు రావడం తాము చూసామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని ఆ ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.