హైదరాబాద్ లో హైకోర్టు ఆంక్షలను సైతం పక్కన పెట్టి నడుస్తున్న పబ్బులపై పోలీసులు కొరడా ఝుళిపించారు.ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ఆరు పబ్లపై కేసు నమోదు చేశారు.
భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని ఆరోపిస్తూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిబంధనలు పాటించని పబ్ లపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే క్లబ్ రోగ్, పోర్టు, హలోకాక్ టెయిల్, ఫ్యాట్ ఫిజీయన్ మరియు జీరో 40 పబ్ లపై కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.