మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది.దీంతో పలాసలో కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకుని విజయవాడకు బయలుదేరారు.
డా.అచ్చన్న మృతి అంశంపై ఉద్రిక్తత నేపథ్యంలో సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని సమాచారం.
అయితే గత కొన్ని రోజులుగా కేబినెట్ విస్తరణపై కూడా ఊహాగానాలు ఊపందకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నడుమ జగన్ నుంచి పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.