ఇంకో నెల గడిస్తే సూపర్ స్టార్ మహేష్ – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో భారి చిత్రం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.
ఏ షెడ్యూలు ఎక్కడ చేయాలో కూడా ప్లాన్ చేసేసారు.మహేష్ డేట్స్ ఇచ్చేసాడు.
ప్రధాన టెక్నిషియన్స్ అందరు ఫిక్స్ అయిపోయారు.ఇక మిగిలింది హీరోయిన్ మాత్రమే.
శ్రద్ధాకపూర్,శృతి హాసన్,కీర్తి సురేష్ .నిన్నటిదాకా వినిపించిన పేర్లు.ఇక కొత్తగా ఈ లిస్టులోకి పరిణీతి చోప్రా, సాయి పల్లవి పేర్లు వచ్చి చేరాయి.అంత ఈజీగా ఇన్ని రూమర్లు ఎలా పుట్టుకొస్తున్నాయో .విచిత్రం కాకాపోతే .వారానికి ఒక కొత్త అమ్మాయి పేరు బయటకొస్తోంది.నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఈ హీరోయిన్ ఎవరు అనేది త్వరగా తేల్చేస్తే .ఒక పని అయిపోతుంది.ఠాగూర్ మధు,ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న ప్రారంభించనున్నారు.
హారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ ఛాయగ్రహణం అందిస్తారు.







