సొసైటీ ఏదైనా హాట్ టాపిక్ నడుస్తూ ఉంటె , దాని మీద సినిమాలు తీయడానికి డైరెక్టర్ లు చాలా సిద్దంగా ఉంటారు.రాం గోపాల్ వర్మకి ఈ విషయం వెన్నతో పెట్టిన విద్య.
సంఘం లో కనపడిన విషయాన్ని అల్లా సినిమా తీసేయడం రామూ కి బాగా అలవాటైన విశేషం.వంగవీటి రంగా జీవిత విశేషాల్ని తెరకి ఎక్కిస్తున్నాడు వర్మ.
ఇప్పుడు అదే పంథా లో గత మూడు వారాలుగా ఏపీ స్టేట్ లో సాగుతున్న కాపు ఘర్జన విశేషాలని సినిమాగా తీయబోతున్నాము అంటూ ఒక డైరెక్టర్ ప్రకటించాడు.కాపు ఉద్యమం మీదే ఏపీ నాయుడు అనే మరో వ్యక్తి ‘ప్రజా గర్జన’ పేరుతో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు.
ముద్రగడ అండ్ కో చేస్తున్న ఉద్యమం నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు నాయుడు.ఆంధ్రప్రదేశ్ జనాభాలో 30 శాతం ఉన్న కాపుల్ని ప్రభుత్వం ఎలా అణగదొక్కుతోందో.
కాపులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు నాయుడు.
ప్రాథమిక హక్కుల కోసం పోరాడటం కూడా ఒక హక్కే అనే నినాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆయన ప్రకటించాడు.
ఇప్పటికే ముద్రగడ ఆందోళన నేపథ్యంలో ‘జయహో ముద్రగడ’ పేరుతో ఓ పాట కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడిక కాపు ఉద్యమంపై సినిమానే తెరకెక్కబోతుండటం విశేషమే.
ఈ చిత్రంలో కొందరు కాపు నేతలు కూడా కనిపిస్తారట.







