విష్ణు భక్తులు విష్ణు పురాణం రాసారని, శివ భక్తులు శివపురాణం రాసారని, కొందరు స్త్రీవాదులు దేవి పురాణం రాసారని అంటుంటారు.ఏ రచయిత అయినా రాసేది తన సొంత అనుభవాలు, అభిప్రాయాలే.
కాని అభిమానం కొద్ది ఇష్టమైన వారిని పొగిడేస్తూ, ఇతరులని చిన్నగా చూపిస్తే దాన్ని ఆధునిక భాషలో భజన అంటారు.
ఇప్పుడు ఒక జాతీయ పత్రిక ( పేరు అప్రస్తుతం) సూపర్ స్టార్ మహేష్ బాబు భజన చేస్తోందనేది మహేష్ ఆంటీ ఫ్యాన్స్ ఆరోపణ.
ఆ పత్రికలో మహేష్ మీద వచ్చిన కథనాలు కొన్ని పోగేసి, వాటి రచయిత ఎవరో కనుక్కోని, అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోని, అతను మహేష్ బాబు అభిమాని అని తేల్చేసారు కొంతమంది.సీ.బి.ఐ ఆఫీసర్లలా ఇంత ఇన్వెస్టిగేషన్ చేసారు సరే, ఇంతకి వారి డిమాండ్ ఏమిటనుకుంటున్నారు !
వారికి కావాల్సింది ఆ జర్నలిస్టు మహేష్ భజన ఆపడం.మరీ ముఖ్యంగా మహేష్ భజన కోసం ఇతర హీరోలని చిన్నగా చేయకూడదు అని ఆ పత్రికకి సందేశాలు కూడా పెట్టేసారు.లోతుగా చూస్తే వారు మాట్లాడింది న్యాయమే.
కాని ఇదంతా చూస్తే మనుషులు ఇంత ఖాలిగా ఉన్నారా అనిపిస్తోంది కదూ !
.






