వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ప్రజలు గులాబీ పార్టీకి ఘన విజయం అందించారని, దీంతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.ఈ విజయం అందించిన ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు.
కెసీఆర్ చెప్పిన మాట వంద శాతం కరెక్టు.విజయం అనేది బాధ్యత పెంచుతుంది.
అదే సమయంలో అహంకారం పెరిగే అవకాశం కూడా ఉంది.అది పెరగకుండా చూసుకోవాలి.
కెసీఆర్ అహంకారి అనే ప్రచారం జరుగుతోంది.ఇందులో కొంత వాస్తవం ఉంది.
కెసీఆర్ గురించి ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా జనం నమ్మలేదని ఎన్నిక ఫలితాలు రుజువు చేశాయి.ఈ నమ్మకాన్ని సీఎమ్ నిలబెట్టుకోవాలి.
నాయకులు కూడా అదే విధంగా ఉండాలి.విజయ గర్వంతో ప్రతిపక్షాలను ఇష్టం వచ్చినట్లు తిట్టడం మంచిది కాదు.
హుందాగా ఉండటం మంచిది.