వీధి పోరాటాలతో, నిరాహార దీక్షలతో ఇక లాభం లేదనుకున్న వై కా పా అధినేత జగన్ కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించారు.ఇది ఆయన వ్యక్తిగత విషయం కాదు.
ఏపీ రాజధాని అమరావతికి భూముల సేకరణ సమస్య.రాజధాని కోసం 33 వేల ఎకరాలను రైతులు స్వచ్చందంగా ఇచ్చారని, బలవంతంగా తీసుకోలేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
కానీ జగన్ వాదన అందుకు విరుద్ధంగా ఉంది.రాజధానిలో కీలక ప్రాంతమైన తుల్లురులోనే బలవంతంగా భూములు తీసుకున్నారని చెబుతున్నారు.
జగన్ ఈ గ్రామంలో పర్యటించారు.అనేక మంది రైతులు ప్రభుత్వం తమ భూములు బలవంతంగా లాక్కుందని జగన్కు ఫిర్యాదు చేశారు.
దీనిపై జగన్ మాట్లాడుతూ ఈ అన్యాయం మీద పార్టీ పరంగా కోర్టుకు వెళతామని చెప్పారు.అధైర్య పడవద్దని అన్నారు.
రాజధాని కోసం భూములు సేకరించిన 29 గ్రామాల్లో 18 గ్రామాలు తుళ్ళూరు మండలంలోనే ఉన్నాయి.







