బాలీవుడ్‌కు వెళ్లనున్న మెగా మూవీ?

సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లడం ఇటీవల చాలా కామన్‌ అయ్యింది.

అదే దారిలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘కంచె’ కూడా బాలీవుడ్‌కు పయనం అవుతోంది.

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాను రెండవ ప్రపంచ యుద్దం నేపథ్యంలో ఒక చక్కని ప్రేమ కథతో తెరకెక్కించాడు.తెలుగులో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కంచె’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, మంచి కలెక్షన్స్‌ను సైతం రాబడుతోంది.

దాంతో బాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే ‘కంచె’ చిత్రం బాలీవుడ్‌ రైట్స్‌ను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుందట.

బాలీవుడ్‌లో సైతం క్రిష్‌ ‘కంచె’కు దర్శకత్వం వహించబోతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్‌లో క్రిష్‌కు ‘గబ్బర్‌’ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది.

Advertisement

దాంతో ‘కంచె’ సినిమాను కూడా క్రిష్‌ తెరకెక్కిస్తే మంచి ఫలితం వచ్చే అవకాశాలున్నాయి.ప్రస్తుతం తెలుగు ‘కంచె’ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న క్రిష్‌ అతి త్వరలోనే హిందీ ‘కంచె’పై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.

హిందీలో బడ్జెట్‌ను 50 కోట్లుగా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.తెలుగులో ‘కంచె’కు 20 కోట్లు ఖర్చు చేశారు.

Advertisement

తాజా వార్తలు