‘ఇదే పాటా.ప్రతి చోటా.
ఇలాగే పాడుకుంటాను…’ అని ఓ పాత తెలుగు సినిమాలో హీరో పాడకుంటాడు.ఆయన పాడకున్నది తన ప్రియురాలి గురించి.
కాని ఈ పాటే కొద్దిగా మార్చి కేంద్ర మంత్రులు పాడుతున్నారు.వారు పాడేది ఆంధ్రప్రదేశ్ గురించి.‘ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల ఆదకుంటాం…కావల్సిన నిధులు ఇస్తా…ఆందోళన పడొద్దు’ అనేది వారి పాట సారాంశం.ఏడాది ఈ పాట పాడుతున్నారుగాని ఫలితం మాత్రం కనబడటంలేదు.
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు.కాని మరోరకంగా సాయం చేస్తాం అంటున్నారు.
మాటలే తప్ప చేతల్లో ఏమీ కనబడటంలేదని ఏపీ నాయకులు చెబుతున్నారు.కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేసిందని బాహాటంగానే చెబుతున్నారు.
అయినా కేంద్ర నాయకులు, మంత్రులు మాత్రం ‘సాయం’ పాట పాడుతూనే ఉన్నారు.ఏపీ రాజధాని అమరావతి భూమి పూజకు హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని నిర్మాణానికి అన్నివిధాలా సాయం చేస్తామని, ఈ విషయంలో ఆందోళన పడొద్దని రొటీన్గా చెప్పారు.
విని ఊరుకోవడం తప్ప బాబు, ఇతర నాయకులు చేసేది ఏముంది.కేంద్రం డబ్బులిచ్చినా, కొద్దిగా విదిలించినా, అసలు ఇవ్వకపోయినా రాజధాని నిర్మించక తప్పదు.