ఇద్దరు రాజాల ప్రొడక్షన్‌ హౌస్‌

ఇటీవలే మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు.

తనకు అత్యంత ఆప్తుడు అయిన శివాజీ రాజాతో కలిసి ఆర్‌.

ఆర్‌ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు.ఈ బ్యానర్‌లో మొదటగా బుల్లి తెర కార్యక్రమాలు మరియు సీరియల్స్‌ను నిర్మించబోతున్నారు.

వీరిద్దరు కలిసి నిర్మిస్తున్న మొదటి కార్యక్రమం త్వరలోనే ఈటీవీలో ప్రసారం కాబోతుంది.ఇక మరో రెండు సీరియల్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీరియల్స్‌తో పాటు సినిమాలను సైతం వీరి నిర్మాణంలో తీసుకు రావాలని ప్రయత్నాల చేస్తున్నారు.మా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇలా నిర్మాణంలోకి అడుగు పెట్టాడు.

Advertisement

శివాజీ రాజా ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో కార్యదర్శిగా ఎన్నిక అయ్యాడు.ఈయన కూడా సినిమాల్లో నటిస్తూ, అప్పుడప్పుడు బుల్లి తెరపై సందడి చేస్తూ ఉన్నాడు.

వీరిద్దరు కలిసి ప్రారంభించబోతున్న ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు