మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా ఏర్పాట్లలో ఉన్నారు.గత కొంత కాలంగా ఈయన మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన జూన్ 4న మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.జూన్ 4న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో మెగాస్టార్ చీప్ గెస్ట్గా పాల్గొనే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
చిరంజీవి 150వ సినిమాకు పూరి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.ఆ అనుబందంతోనే పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోను విడుదల చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి.
ఈ సినిమాలో ఛార్మి వేశ్య పాత్రలో కనిపించనుంది.చాలా మాస్గా ఛార్మి పాత్ర ఈ సినిమాలో ఉంటుందని దర్శకుడు పూరి చెబుతున్నాడు.







