ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.పూరి జగన్నాద్ దర్శకత్వంలో, రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తాజాగా తేలిపోయింది.
ఈ సినిమాకు బివియస్ రవి కథను సిద్దం చేశాడు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతుంది అంటూ ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు చెబుతున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.ఆ అవకాశం ముద్దుగుమ్మ నయనతారకు దక్కేలా ఉందని సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ ఎక్కువగా యువ హీరోలకు సూట్ అయ్యే వారు ఉన్నారు.నయనతార మాత్రమే సీనియర్ హీరోలు అయిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో కలిసి నటించింది.
అందుకే కొత్త వారిని వెదికే కంటే నయనతారతో చిరంజీవికి జత కలిపితే బాగుంటుందని దర్శకుడు పూరి జగన్నాధ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.నయనతారకు చిరంజీవి సైతం ఓకే చెప్పే అవకాశాలున్నాయి.
అతి త్వరలోనే నయనతార హీరోయిన్గా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.ఆగస్టు 22న పూజా కార్యక్రమాలు జరుపుకుని, సెప్టెంబర్లో సినిమాను ప్రారంభించాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.
ఈ సినిమాకు ఆటో జానీ అనే టైటిల్ను ఫిక్స్ చేయడం జరిగింది.