ఇండోనేషియాలో(Indonesia) జరిగిన ఒక షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాలో (CCTV camera)రికార్డ్ అయింది.ఒక మహిళ స్కూటర్పై వెళ్తూ రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది.
ఆ దెబ్బకు అతను గింగిర్లు తిరుగుతూ నేలకూలాడు.కానీ, మానవత్వం మరిచిన ఆ స్కూటర్ నడిపిన మగువ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది.
గాయపడిన వ్యక్తిని అక్కడే వదిలేసి పరారైంది.

ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు.బాధితుడి పరిస్థితి ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు.“అసలు ఆమెకు ఎవరైనా సహాయం చేశారా? ఆమెను గుర్తించారా?” అంటూ కామెంట్లు పెట్టారు.కొందరు మాత్రం బాధితురాలిదే తప్పు అన్నారు.“రోడ్డు మధ్యలో ఎందుకు నడుచుకుంటూ వెళ్తోంది? జాగ్రత్తగా ఉండాలి కదా” అంటూ విమర్శించారు.కానీ చాలామంది మాత్రం స్కూటర్ నడిపిన మహిళను (woman who rode the scooter)తప్పుపట్టారు.“ఆమె వెంటనే ఆగి సహాయం చేయాల్సింది” అని మండిపడ్డారు.“పోలీసులు ఆమెను వెంటనే పట్టుకోవాలి.బాధితుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.

మరో షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో జరిగింది.ఒక వ్యక్తిని కారు బోనెట్పై కిలోమీటర్ల తరబడి లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.వీడియోలో ఆ వ్యక్తి కారు బోనెట్ను గట్టిగా పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేలాడుతూ కనిపించాడు.
కారు రద్దీగా ఉండే రోడ్లపై దూసుకుపోతున్నా డ్రైవర్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు.చివరికి స్థానికులు కారును ఆపి డ్రైవర్ను నిలదీశారు.బాధితుడు షాక్లో వణికిపోతూ డ్రైవర్ కూలర్ను గట్టిగా పట్టుకుని ఉన్నాడు.ఈ ఘటనకు కారణం ఇంకా తెలియలేదు.
కానీ వీడియో చూసిన జనం మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.







