రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్ఐ రమాకాంత్.స్థానిక ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు.
శివరాత్రి నరేష్,అతని తండ్రి రాజు లు కలిసి చేతులతో కుర్చీతో దాడి చేయగా పరశురాములు తలకు తీవ్ర గాయాలు అయ్యాయని బాధితుడు ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ తెలిపారు.







