యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రియమైన శిష్యుడుగా ఉండే నన్నూరి నర్సిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడిగా అవకాశం దక్కింది.ఆయన మొదటి నుండి ఒకేపార్టీ,ఒకేజెండా అనే నినాదంతో టిడిపిలో ఉంటూ తెలంగాణ టిడిపికి రాష్ట్ర నాయకుడుగా నిస్వార్ధంగా సేవలందిస్తూ వస్తున్నారు.
దీనితో ఈ అవకాశం వచ్చిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.







