రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వీరుడు, మాజీ మంత్రివర్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన సేవలను కొనియాడారు.
లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపల్లి దేవాంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, ఉపాధ్యక్షులు గోష్కే దేవదాస్ , శ్రీరాం సుదర్శన్, కోశాధికారి వనం బాలరాజు, నాయకులు వనం ఎల్లయ్య, గుల్లపల్లి మహేష్ ,గాజుల దేవదాస్, ఆడెపు గంగారం, సత్యనారాయణ, రంగయ్య, శ్రీకాంత్ ,భాస్కర్ ,వేణు, నరసింహులు, మహేష్ విఠల్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.