రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఆ కాలనీని కలెక్టర్ సోమవారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి,
వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.స్మశాన వాటిక కోసం స్థలాన్ని గుర్తించాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ జయంత్ ను ఆదేశించారు.
ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.