తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మణిరత్నం( Mani Ratnam ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేశాయి.
ఇక ఇలాంటి మణి రత్నం ప్రస్తుతం కమలహాసన్ తో ‘థగ్ లైఫ్’( Thug Life ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళ కాంబో కుదిరిందనే చెప్పాలి.
ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో నటించినందుకు గాను కమలహాసన్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
ఇక అదే ఊపుతో ఇప్పుడు కూడా మంచిగా అర్థం ఇద్దరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇక కమల హాసన్ శంకర్( Shankar ) డైరెక్షన్ లో చేసిన ఇండియన్ 2 సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.అయినప్పటికీ మణి రత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ గతంలో చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
రెండు పార్టు లుగాతెరకెక్కిన ఈ సినిమా తమిళం లో మంచి విజయం సాధించడమే కాకుండా మంచి క్రేజ్ ను కూడా తీసుకొచ్చింది.ఇద్దరు కలిసి మరోసారి మ్యాజిక్ చేయాలని ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రావడం వల్ల సినిమా మీద అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి.అయితే ఈ సినిమాలో కమలహాసన్ కూతురు అయిన శృతిహాసన్( Shruti Haasan ) కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతుందంటూ సినిమా ఇండస్ట్రీ లో సమాచారం అయితే అందుతుంది.ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు.కానీ మొత్తానికి అయితే ఈ న్యూస్ అనేది ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో చెక్కర్లు కొడుతుందనే చెప్పాలి…
.