హైకోర్టు తీర్పులో వేణు స్వామికి ఊరట.. జర్నలిస్టుకు షాక్..

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి( Venuswamy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఏదో ఒక సందర్భాన ఆయన సోషల్ మీడియాలో ఉండడం గమనిస్తూనే ఉంటాము.

 Big Relief For Astrologer Venu Swamy In Telangana High Court Details, Venu Swam-TeluguStop.com

తాజాగా ఆయనను జర్నలిస్ట్ మూర్తి( Journalist Murthy ) బెదిరించాడన్న వీడియో వైరల్ ఆయన సంగతి తెలిసిందే.అయితే, ఈ గొడవ ముందు ఆయన నాగచైతన్య – శోభిత ధూళిపాల రిలేషన్ పై చేసిన వివాదాస్పద జోష్యం సంబంధించి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్లో మహిళా కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాయి.

దీంతో వేణు స్వామికి తెలంగాణ రాష్ట్ర ఉమెన్ కమిషన్ సామాన్లు జారీ చేసింది.ఈ విషయం సంబంధించి ఆగస్టు 22న ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.

అయితే, ఈ విషయంపై వేణు స్వామి హైకోర్టుకు వెళ్లి మహిళా కమిషన్( Women Commission ) ఆదేశాలను నిలిపివేయాలని కోరగా అందుకు హైకోర్టు సమన్లపై స్టే ఇచ్చింది.

Telugu Ashok Goud, Astrologervenu, Journalist, Naga Chaitanya, Nerella Sharada,

ఇకపోతే.ఈ విషయంలో లోకస్ స్టాండి అనే అంశం సంబంధించి జర్నలిస్టులు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు.అసలు ఈ విషయం సంబంధించి జాతకం తమ ఫలానా ప్రభావం చూపుతుంది అని కోర్టు ఎదుట నిరూపిస్తే అని వారు వేసిన లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు సాగుతాయని గుర్తించలేకపోతున్నారు.

ఇకపోతే కమిషన్ ఎదుట ఏదో ఒక రచ్చ చేసి వేణు స్వామి మరింత ఇరకాటంలో పడేయాలని చాలామంది ఊహించారు.అయితే వేణు స్వామి మాత్రం కనీసం ఆయన కోర్టు ముందర హాజరు అవ్వకుండా హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు.

ఇది ఇలా ఉండగా.మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఉమెన్ కమిషన్ సమన్లకు వ్యతిరేకంగా ఉన్నారు.

ఇక్కడ హాస్యాస్పద విషయం ఏమిటంటే.ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద( Nerella Sharada ) కాంగ్రెస్ కాగా లాయర్ పొన్నం అశోక్ కూడా కాంగ్రెస్ మద్దతుదారులే.

ఇప్పుడు వీరిద్దరి మద్దతుకు విరుద్ధంగా నడుచుకోవడం అందర్నీ ఆచారానికి గురిచేస్తుంది.

Telugu Ashok Goud, Astrologervenu, Journalist, Naga Chaitanya, Nerella Sharada,

అసలు వేణు స్వామి నాగచైతన్య( Nagachaitanya ) విషయం మధ్య ఈ జర్నలిస్టు ఎందుకు కలగజేసుకుంటున్నాయో అర్థం కావడం లేదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.వేణు స్వామి ఆయనకు తెలిసిన విద్య ద్వారా జాతకం చెబుతున్నారు.అది నమ్మేవారు నమ్ముతారు లేకపోతే లేదు.

అయితే, జర్నలిస్టు సంఘాలు అలాగే మహిళలని వేణు స్వామి కించపరిచాడు అంటూ నానా హంగామా చేస్తున్నాయి.అయితే వేణు స్వామి జ్యోతిష్యంలో ఆయన ఎవరిని అనుమానించింది లేకపోవడం, అలాగే కించపరచడం లాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు.

ఈ విషయాన్ని గమనించినట్లయితే సినీ జర్నలిస్టులు ఆయనపై పగ పట్టినట్లు ఇట్లే కనపడుతుంది.ప్రస్తుతం వేణు స్వామికి హైకోర్టు నుంచి సానుకూలంగా తీర్పురావడంతో జర్నలిస్టు సంఘం వారికి షాక్ తగిలింది.

చూడాలి మరి ఈ విషయంలో ముందు ముందు ఎలాంటి విషయాలు కొత్తగా వినపడతాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube