తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సిటీలో( Gwalior City ) ఓ దారుణ సంఘటన జరిగింది.మంగళవారం రోజు మాస్క్లు ధరించిన ఇద్దరు దొంగలు ఓ ఇంటి దగ్గర ఒక మహిళను ఆపి, బంగారు చైన్ ఇవ్వమని బలవంతం చేశారు.
మహిళ ఇవ్వకపోగా, ఆగ్రహించిన దొంగలు ఆమెను కాల్చి చంపేశారు.గుండు ఛాతీని తాకడంతో , ఆమె అక్కడికక్కడే మరణించింది.
మరణించిన మహిళ పేరు అనితా గుప్తా( Anita Gupta ).ఆమె వయసు 55 ఏళ్లు.ఆమె కుమారుని పేరు జై గుప్తా( Jai Gupta ).
ఇద్దరు దొంగలు బైక్పై వచ్చి ఒక మహిళను ఆమె కొడుకుతో పాటు బెదిరించిన దృశ్యాలు CCTV కెమెరాల్లో రికార్డయ్యాయి.వాళ్లు తమ దగ్గర ఉన్న తుపాకితో వాళ్ళిద్దరినీ బెదిరించి, మహిళను బంగారు చైన్ ఇవ్వమని డిమాండ్ చేశారు.మహిళతో పాటు కొడుకు కూడా గోల్డ్ చైన్( Gold chain ) ఇవ్వడానికి నిరాకరించగా, దొంగలు అతనిపై కాల్పులు జరిపారు.
కానీ బుల్లెట్ మహిళను ఛాతి భాగంలో తగిలింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
మృతురాలి ఫ్యామిలీ బస్సుల వ్యాపారం చేస్తుంది.వారికి చాలా మందితో గొడవలు జరిగాయి.ఈ ఘటన జరిగిన రోజు, అనితా, ఆమె కొడుకు జై డాక్టర్ను చూసి ఇంటికి బయలుదేరారు.అనితా గుప్తాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.ఈ హత్య జరిగిన వెంటనే పోలీసు అధికారులు తమ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు.
అక్కడ జరిగిన దాడి గురించి విచారణ మొదలుపెట్టారు.ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేశారు.
దొంగలను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ను ఉపయోగించి వెతుకుతున్నారు.