సూర్యాపేట జిల్లా( Suryapet District ):మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని,సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను అదేశించారు.గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్,మఠంపల్లి పోలీస్ స్టేషన్లను ఎస్పీ జనరల్ విజిట్ చేసి,స్టేషన్ల పరిస్థితిని,రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ విజిట్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తానన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై,సైబర్ నేరాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలకు అవగాహన కోసం సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఈ కార్యక్రమం లో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,( DSP Sridhar Reddy ) హుజూర్ నగర్ సీఐ చలమందరాజు,ఎస్సై ముత్తయ్య,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.