రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తపల్లి – బోయినిపల్లి మండలాల సరిహద్దు వద్దగల రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి రహదారి బురదమయంగా తయారైంది.దీంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,వాహనాలు స్కిడ్ అయ్యి ప్రమాదాలకు గురయ్యే అవకాశం వుందని ఆవేదన చెందుతున్నారు.
సంబధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.