హోటల్ యజమాని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన నిందితులు అరెస్ట్

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda ) బైపాస్ రోడ్డు లోని ఉషారాణి హోటల్ కి శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు సుమారు 4:30 గంటల సమయంలో మద్యం సేవించి పరోటా తినడానికి వెళ్ళారు.ఇప్పుడే హోటల్ ఓపెన్ చేశామని,కొంచెం టైం పడుతుందని చెప్పడంతో వారితో గొడవపడి హోటల్ యజమాని వెంకటేశ్వరరావు@ వెంకన్నపై కూరగాయలు కోసే కత్తితో హత్యాయత్నం చేయగా తలపైన పగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

 The Accused Who Tried To Kill The Hotel Owner By Stabbing Him Were Arrested-TeluguStop.com

బాధితుని ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ నాగార్జున(CI Nagarjuna ) కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి,ఆ నలుగురు నిందితులలో నాగెళ్ళ సురేష్, ఇలుగు ఏడుకొండలు,దామర రాంబాబు అనే ముగ్గురిని శనివారం అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించారు.కేసు నమోదైన 24 గంటల లోపల నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడంలో చొరవ చూపిన ఎస్ఐలు రాంబాబు,కృష్ణయ్య, మరియు కానిస్టేబుల్స్ పి.బాలకృష్ణ, కె.కళ్యాణ్,ఎం.రామకృష్ణ, ఎస్కే.అక్బర్ లను సిఐ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube