మీరా నందన్.( Meera Nandan ) ఈ పేరు వినగానే చాలామందికి గుర్తుకు వచ్చే సినిమా జై బోలో తెలంగాణ.
( Jai Bolo Telangana ) ఈ సినిమా ఒకప్పుడు థియేటర్లలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతోపాటు హీరోయిన్ మీరానందన్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది.2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.ఈ మూవీలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా మీరా నందన్ హీరోయిన్ గా నటించింది.
చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్ లో కనిపించి తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరా నందన్. అయితే ఈమె పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ జై బోలో తెలంగాణ హీరోయిన్ అంటే చాలు వెంటనే గుర్తుపట్టేస్తారు.అంతలా ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది మీరా నందన్.
ఇది ఇలా ఉండి తాజాగా ఈమె మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకుంది.
గుడిలో సింపుల గా వివాహం చేసుకుంది.శనివారం ఉదయమే జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.శనివారం ఉదయం గురువాయూర్ ఆలయంలో( Guruvayoor Temple ) లండన్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీజుతో( Sreeju ) మీరా నందన్ ఏడడుగులు వేసారు.వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.గత ఏడాది సెప్టెంబర్ 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.మీరా, శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోని ద్వారా కలుసుకున్నారని సమాచారం.ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు చూసి మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.