ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఏదో ఒక జంతువును పెంచుకోవడం దాని ఆలనా పాలనా చూసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.అంతేకాకుండా వారు ఎక్కడికైనా బయటికి వెళ్లిన సమయంలో ఆ జంతువులను కూడా అలా బయటికి తీసుకుపోవడం పరిపాటిగా మారింది.
కొంతమంది వాళ్ళ ఇంట్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటే మరికొందరు పాములను పెంచుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒక కొండచిలువ( Python ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి కొండచిలువను ఏకంగా తన ఒళ్లో కూర్చోపెట్టుకొని మెట్రో రైల్ లో( Metro Train ) ప్రయాణించడం మనం గమనించవచ్చు.అంతేకాకుండా ఆ కొండచిలువ మెల్లగా కదులుతూ ఆ వ్యక్తి వైపుకు కదలడం కూడా మనం చూడవచ్చు.అయితే ఈ విషయాన్ని తోటి ప్రయాణకులు సరిగ్గా పట్టించుకోకపోయినా.ఆ వ్యక్తి పక్కనే కూర్చున్న మహిళ మాత్రం ఆ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయంతో కదలకుండా అలానే కదలకుండా కూర్చుంది.ఆ పాము ఎక్కడ తనపై దాడికి దిగుతుందో అన్న భయంతో ఆ మహిళ కనీసం అడుగు కూడా ముందుకు వేయకుండా అలానే కూర్చుంది.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవ్వడంతో కొంతమందిని నెటిజన్స్ మాత్రం భారీ ఎత్తుగా రెస్పాండ్ అవుతున్నారు.ఇలాంటి ప్రమాదకరపు జంతువులను ప్రజా రవాణా వ్యవస్థకు తరలించడం మంచిదని కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొందరయితే.వారు ప్రమాదంతో ప్రయాణం చేయడంతో పాటు ఇతరులను కూడా ఇబ్బంది పడుతున్నారని కామెంట్ చేస్తున్నారు.ఇక అంతేకాకుండా ఇటీవల కాలంలో మెట్రోలో ప్రయాణికుల ప్రవర్తన గురించి ఎవరికి అర్థం అవ్వటం లేదన్నట్లు కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.