ఒకప్పుడు విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే అందరూ కూడా థియేటర్ల వద్ద ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు.ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ అయితే ఆయన సినిమాలకు బ్రహ్మ రథం పట్టేవారు.
కానీ ప్రస్తుతం వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రప్పించడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు.ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైంధవ్ సినిమా( Saindhav Movie ) ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇక కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఇక ఇప్పటికే వెంకటేష్ రాణా తో కలిసి రానా నాయుడు( Rana Naidu ) అనే సిరీస్ ని చేశాడు.ఇక ఆ సిరీస్ లో వెంకటేష్ చాలా బోల్డ్ గా మాట్లాడడం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడంతో వీటన్నింటి వల్లే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో కొంతవరకు క్రేజ్ అయితే తగ్గిందని చాలామంది అంటున్నారు.మరి ఇప్పుడు రానా నాయుడు సెకండ్ సీజన్ ని కూడా రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంతకు ముందు సీజన్ మాదిరిగానే ఇప్పుడు వచ్చే సీజన్ లోక్ కూడా వెంకటేష్ బూతులు మాట్లాడితే మాత్రం వెంకటేష్ సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం మానేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఇప్పటికే వెంకటేష్ మీద ఫ్యామిలీ అభిమానులకు( Family Audience ) కొంతవరకు నెగిటివ్ ఒపినియన్ అయితే వచ్చింది…కాబట్టి ఆయన సినిమాలను ఇంతకు ముందు మాదిరిగా ఫ్యామిలీ ఆడియెన్స్ చూడకపోవచ్చు… ఇక దీన్ని బట్టి చూస్తే వెంకటేష్ తర్వాత సినిమాలని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది కీలకంగా మారనుంది.ఇక ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను చేస్తున్నాడు.మరి ఈ సినిమాని బట్టి వెంకటేష్ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు అనేది క్లారిటీ గా తెలుస్తుంది…
.