పాలిటెక్నిక్ లో విజ్ఞాన్ విద్యార్థికి రాష్ట్ర 191వ ర్యాంకు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిన విద్యార్థి చింత రిశ్వంత్ సోమవారం వెలువడిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాలలో 191 ర్యాంకు సాధించగా మంగళవారం రిశ్వంత్ ను కరస్పాండెంట్ లతీఫ్ సన్మానించారు.విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ మాట్లాడుతూ రిశ్వంత్ తమ పాఠశాలలో పదవ తరగతి చదివి 10 జీపీఎస్ సాధించడం జరిగిందన్నారు.

 191st Rank In The State For Vigyan Student In Polytechnic , Polytechnic, 191st R-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ లో 120 మార్కుల గాను 112 మార్కులు సాధించడం జరిగిందన్నారు.రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో 191వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు.

కరస్పాండెంట్ లతీఫ్ రిశ్వంత్ ను శాలువాతో సత్కరించి, విద్యార్థి తండ్రి చింత రాజును అభినందించారు.అదేవిధంగా ప్రిన్సిపల్ శరత్ కుమార్, ఉపాధ్యాయ బృందం రిశ్వంత్ ను అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube