ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..!!

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) అజ్ఞాతాన్ని వీడారు.మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో( SP Office ) సంతకం చేసి వెళ్లారు.

 Pinnelli Ramakrishna Reddy Appeared In The Sp Office Details, Ysrcp, Pinnelli R-TeluguStop.com

ఏపీ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కేసుతో సహా మూడు కేసులు నమోదు కాక ఆయన హైకోర్టులో బెయిల్ పిటీషన్లు వేశారు.దీంతో పిన్నెల్లి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది.

ఇదే సమయంలో నిత్యం ఎస్పీ ఆఫీస్ లో సంతకం చేయాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎస్పీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లారు.

ఈసారి ఏపీ ఎన్నికలలో పల్నాడులో( Palnadu ) భారీగా గొడవలు చోటు చేసుకున్నాయి.

తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.బాంబులు కూడా విసురుకున్నారు.ఈ దాడులలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు.

గాయాలు కూడా అయ్యాయి.అయితే ఓ పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం నేతలు( TDP Leaders ) రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని.

అక్కడికి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.ఈవీఎం( EVM ) ధ్వంసం చేయటం.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో… కేసు నమోదు కావడం జరిగింది.దీంతో కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube