ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..!!

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) అజ్ఞాతాన్ని వీడారు.

మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో( SP Office ) సంతకం చేసి వెళ్లారు.

ఏపీ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కేసుతో సహా మూడు కేసులు నమోదు కాక ఆయన హైకోర్టులో బెయిల్ పిటీషన్లు వేశారు.

దీంతో పిన్నెల్లి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది.

ఇదే సమయంలో నిత్యం ఎస్పీ ఆఫీస్ లో సంతకం చేయాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎస్పీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లారు.

ఈసారి ఏపీ ఎన్నికలలో పల్నాడులో( Palnadu ) భారీగా గొడవలు చోటు చేసుకున్నాయి.

"""/" / తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.

బాంబులు కూడా విసురుకున్నారు.ఈ దాడులలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు.

గాయాలు కూడా అయ్యాయి.అయితే ఓ పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం నేతలు( TDP Leaders ) రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని.

అక్కడికి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.ఈవీఎం( EVM ) ధ్వంసం చేయటం.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో.కేసు నమోదు కావడం జరిగింది.

దీంతో కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

వృద్ధురాలే కానీ బ్రెడ్ పకోడీలు ఎంత ఫాస్ట్‌గా చేస్తుందో చూస్తే..??