ఏపీ కొత్త డీజీపీని( DGP ) ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది.ఈ మేరకు ముగ్గురు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ పంపనున్నారు.
కాగా ఏపీ డీజీపీ రేసులో ద్వారకా తిరుమల రావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో డీజీపీ ఎంపిక వ్యవహారంపై ఇవాళ సాయంత్రానికి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండగా.ఆయనను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి తదుపరి డీజీపీ ఎవరనే వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.