తాజాగా సౌదీ అరేబియా( Saudi Arabia )లో భారతదేశానికి చెందిన డాక్టర్ కు ఐదేళ్ల జైలు శిక్షను అలాగే లక్షన్నర రియాల్ల జరిమానాను విధించింది కోర్టు.తన కూతురి వయసున్న ఓ విద్యార్థికి ఆసుపత్రిలో ల్యాబ్ లో రక్తం పరీక్షల్లో నమూనాలలో వివరాలను చెబుతున్న క్రమంలో పొరపాటున కంప్యూటర్ మౌస్ పై ఆ అమ్మాయి చేతిని పొరపాటున తగిలినందుకాను న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది.
ఈ సంఘటన సౌదీ అరేబియాలోని జిజాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.పని జరుగుతున్న ప్రదేశాలలో మహిళలకు వేధింపుల నిర్మూలన చట్టం కింద దీన్ని పరిగణలోకి తీసుకొని సౌదీ అరేబియా న్యాయస్థానం ఈ తీర్పుని వెల్లడించింది.
ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత జరిమానా కూడా కట్టిన తర్వాతనే జైలు నుండి విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

అయితే ఈ కేసులో భాగంగా డాక్టర్( Doctor ) తాను చేతిని వెంటనే వెనక్కి తీసుకున్నట్లు శాంపిళ్లను చూపించడం కోసం మరోసారి డాక్టర్ తను చేయని తాకారని యువతి ఫిర్యాదుల పేర్కొంది.అలా రెండోసారి చేయి తాకినప్పుడు ఆ అమ్మాయి ల్యాబ్ నుండి బయటకు వచ్చి రిసెప్షన్ ఏరియాలో కూర్చొని ఉండగా దాంతో కంగారుపడ డాక్టర్ ఆ అమ్మాయి వద్దకు వచ్చి మాట్లాడి ఇతరులతో విషయాన్ని చెప్పొద్దంటూ కూడా వేడుకున్నట్లు తెలిపింది.కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ ఇదివరకు యునైటెడ్ ఎమిరేట్స్( United Emirates ) లో కూడా డాక్టర్ గా విధులను నిర్వహించారు.57 ఏళ్ల డాక్టర్ కర్ణాటక తో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలలో అలాగే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది.

ఈ కేసులో భాగంగా జీనాన్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదరు ప్రాంతానికి వెళ్లి కేసు సంబంధించి అప్పీల్ చేయడానికి కూడా భారతీయులు( Indians ) వెనుకంజ వేసే పరిస్థితి నెలకొనడంతో డాక్టర్ కు ఈ పరిస్థితి ఏర్పడింది.దక్షిణ జీనాన్ రాష్ట్రంలో సువిశాల ఎడారులతోపాటు ప్రకృతి రమ్యంగా ఆ ప్రదేశం ఉంటుంది.అక్కడ ఎక్కువగా భారతీయులు పనిచేసుకుంటూ జీవన కొనసాగిస్తున్నారు.
మనకందరికీ తెలిసినట్లుగానే సౌదీ అరేబియా చట్టాలు మహిళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.







