త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరగనున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు తెలంగాణకు చేరుకుంటున్నాయి.ఈ మేరకు సుమారు 160 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి.
ఎలక్షన్ బందోబస్తుకు సెంట్రల్ ఆర్మడ్, సీఏపీఎఫ్ ( Central Armed Police Forces )దళాలు భారీగా రానున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 60 వేల మంది పోలీసులు ఉన్నారు.
ఈ క్రమంలోనే విధుల్లోకి మరో 120 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు చేరనున్నాయి.కాగా ఒక్కో కంపెనీలో సుమారు 70 నుంచి 80 మంది వరకు సిబ్బంది ఉండనున్నారు.
అయితే ఇప్పటికే 60 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకోగా.మే నెలలో మిగత బలగాలు తెలంగాణకు రానున్నాయి.