ఏపీలో ఎన్నికలకు( AP Politics ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో టీడీపీ ( TDP ) వీడియో వైరల్ గా మారింది.
ఈ మేరకు టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించిన వీడియోను వైసీపీ( YCP ) రిలీజ్ చేసింది.
వైసీపీ సుమారు 147 స్థానాల్లో ముందంజలో ఉందని టీడీపీ ఒప్పుకున్నట్లు ఈ వీడియోలో ఉంది.
ఈ విషయాన్ని టీడీపీ నేతలకు ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేశ్( Koneru Suresh ) వెల్లడించారు.ఈ క్రమంలో ఓటమిని టీడీపీ ముందే ఒప్పుకుందని వైసీపీ వీడియోను రిలీజ్ చేసింది.
కాగా ప్రస్తుతం టీడీపీ వీడియో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.