రాజన్న సిరిసిల్ల జిల్లా: చిన్ననాటి దోస్తులు వారు.కలిసి పదో తరగతి వరకు చదువుకున్న బాల్యమిత్రులు అందులో నారాయణపూర్( Narayanpur ) గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాస్( Panthangi Srinivas) అనే వ్యక్తి గత నాలుగేళ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు .
తన కూతురు వివాహం సందర్భంగా శుక్రవారం పూర్వ విద్యార్థులు కలిసి 50వేల ఆర్థిక సహాయంతో పాటు, పుస్తె మట్టలు, అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో 1988 బ్యాచ్ వారు పాల్గొన్నారు.