టీడీపీ నేతల దోపిడీ కోసమే తెరపైకి అమరావతి..: మంత్రి బొత్స

పరిపాలన రాజధానికి సీఎం జగన్( CM YS Jagan ) కట్టుబడి ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రానున్న ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.

 Amaravati Came To The Fore To Exploit Tdp Leaders: Minister Botsa,minister Botsa-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మంత్రి బొత్స( Minister Botsa Satyanarayana ) ఆరోపించారు.టీడీపీ నేతల దోపిడీ కోసమే అమరావతిని తెరపైకి తెచ్చారని విమర్శించారు.

కూటమి అభ్యర్థి భరత్ కు విద్యావ్యవస్థపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.ఈ క్రమంలో భరత్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ( Visakha Steel Plant Privatization )కు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.ఈ విషయంపై కూటమి అనుకూలమా? వ్యతిరేకమా? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్ అన్న మంత్రి బొత్స రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వలన సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube