నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఏప్రిల్ 18న 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది.లోక్సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25గా నిర్ణయించారు.ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ గడువు ఉంటుంది.
మే 13న పోలింగ్ జరగనుండగా,జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.